భారతదేశం, మే 24 -- ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును 2025 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా ఈపీఎఫ్ఓ నిర్ధారించింది. ఈపీఎఫ్ఓ ప్రతిపాదనకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ అయిన ఈపీఎఫ్ఓకు 7 కోట్లకు పైగా చందాదారులున్నారు. వారి ఖాతాల్లో ఈ వార్షిక వడ్డీరేటుతో వడ్డీని జమ చేయనున్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఫిబ్రవరి 28న ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. ఫిబ్రవరి 28న ఢిల్లీలో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 237వ సమావేశంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నారు. అనంతరం, 2024-25 సంవత్సరానికి ఆమోదం పొందిన ఆ ఆ ప్రతిపాదిత వడ్డీ రేటును ఆర్థిక మంత్రిత్వ శాఖ సమ్మతి కోసం పంపారు.

2...