Hyderabad, జూన్ 13 -- తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న తొలిసారి కలిసి నటించిన సినిమా కుబేర. హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు.

శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి ఎస్‌వీసీఎల్ఎల్‌పీపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు కుబేరా చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

పోయిరా మామ, 'ట్రాన్స్ ఆఫ్ కుబేర', పీపీ డమ్ డమ్ సాంగ్స్ చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇక కుబేర సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మల...