భారతదేశం, జూలై 29 -- ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరదలు రావడంతో నాగార్జున సాగర్ జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దీంతో అధికారులు ప్రాజెక్టు క్రెస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 18 సంవత్సరాలలో జూలై నెలలో సాధారణ షెడ్యూల్ కంటే ముందుగానే గేట్లు తెరవడం ఇదే మొదటిసారి. దిగువ భాగంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు (312.04 టీఎంసీలు), ప్రస్తుతం ఇది 586.60 అడుగులుగా ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 'నాగార్జున సాగర్ మాకు ఆధునిక ఆలయం. నెహ్రూ పునాది వేశారు, ఇందిరా గాంధీ దానికి ఊతం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు 26 లక్షల ఎకరాల వ్యవస...