Nellore,andhrapradesh, మే 1 -- ఇంటికో పారిశ్రామిక వేత్తను తయారుచేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అందులో భాగంగానే 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

మే డే సందర్భంగా నెల్లూరు జిల్లా నారంపేటతో పాటు మరో 10 చోట్ల MSME పార్కులను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. నారంపేటలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. "175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఎవరైనా సరే నేరుగా వచ్చి ఫ్యాక్టరీ పెడితే చాలు. మిగిలిన కరెంటు, షెడ్ల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలన్నీ ఇక్కడ మేమే కల్పిస్తాం. సంపద రావాలని హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం. ఇపుడు అమరావతిని నిర్మిస్తున్నాం. ఎంఎస్ ఎంఈ పార్కుల ఏర్పాటు...