Hyderabad, మే 29 -- ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో నంది అవార్డ్స్ ఎంతో కీలకంగా ఉండేవి. గత 14 ఏళ్లుగా నంది అవార్డ్స్‌ను ప్రకటించలేదు. కానీ, 14 ఏళ్ల తర్వాత టాలీవుడ్ పరిశ్రమకు అవార్డ్స్ ప్రకటన వచ్చింది. అయితే, నంది అవార్డ్స్‌కు బదులుగా తెలంగాణలో చిత్ర పరిశ్రమకు గద్దర్ అవార్డ్స్ పేరుతో పురస్కారాలను ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు అవార్డులు ప్రకటించడం విశేషంగా మారింది. గద్దర్ అవార్డ్స్ 2024ను జ్యూరీ ఛైర్మన్ జయసుధ ప్రకటించారు. అయితే, 2024 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు పలు విభాగాల్లో అవార్డులు అనౌన్స్ చేస్తూ ప్రకటన విడుదల చేశారు.

గద్దర్ అవార్డ్స్ 2024 కోసం 1248 నామినేషన్స్ రాగా 11 కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించారు. అలాగే, 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ 31 వరకు విడుదలైన సినిమాల్లో ఒక మూవీని ఉత్తమ చిత్...