భారతదేశం, మే 30 -- కర్ణాటకలో 125 ఏళ్లలో తొలిసారిగా మే నెలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. అనేక జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. బెంగళూరులోని విధానసౌధలో అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్, జిల్లా పంచాయతీల సీఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

కర్ణాటకలోని కోస్తా ప్రాంతమైన దక్షిణ కన్నడ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఆరేళ్ల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒకే ఘటనలో ఐదుగురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం గురించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ వర్షాలకు ఇల్లు పూర్తిగా దెబ్బతింటే తక్షణమే రూ.1.20 లక్షల పరిహారం అందించాలని ఆదేశించారు. కొండచరియలు విరిగిపడటంతో మంగళూరు సమీపంలోని మోంటెపాడులో ఓ ఇల్లు దెబ్బతింది. కొండచరియలు విరిగి...