భారతదేశం, మే 11 -- ఆపరేషన్ సిందూర్ కింద క్షుణ్ణంగా చర్చించిన తర్వాత తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించామని భారత సైన్యం తెలిపింది. మే 7న జరిగిన ఆపరేషన్‌లో 9 ఉగ్రవాద స్థావరాల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ఆదివారం తెలిపారు. ఈ దాడుల్లో యూసుఫ్ అజహర్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ వంటి వారు కూడా హతమయ్యారు.

లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, ఎయిర్ మార్షల్ ఏకే భారతి, వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారద ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. పలు కీలక విషయాలు వెల్లడించారు. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించామని అధికారులు చ...