భారతదేశం, జూన్ 24 -- మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక థ్రిల్లర్​ సినిమాను తలపిస్తూ సోమవారం అర్థరాత్రి కీలక మలుపులు తిరిగాయి. తమ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేయడంతో.. ప్రతీకారం తీర్చుకునేందుకు, ఖతార్​లోని అగ్రరాజ్య మిలిటరీ స్థావరాలపై ఇరాన్​ దాడులు చేసింది. వాస్తవానికి ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను అత్యంత ఆందోళనకు గురిచేశాయి. కానీ.. దాడులు ముగిసిన కొద్దిసేపటికే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ తన ట్రూత్​ సోషల్​ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్​- ఇరాన్​ మధ్య పూర్తిస్థాయి కాల్పుల విరమణ అమలవుతుందని తెలిపారు. ఫలితంగా, 12 రోజుల యుద్ధానికి ముగింపు పడినట్టు వెల్లడించారు.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బీ-2 బాంబర్లను ఉపయోగించి.. గత శనివారం అర్థరాత్రి ఇరాన్​లోని 3 కీలక అణు స్థావరాలపై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే (పూర్తి వివర...