భారతదేశం, జూన్ 7 -- గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రిగ్గింగ్ కు పాల్పడిందని, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే పునరావృతమవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఒక వార్తాపత్రికలో ప్రచురితమైన తాను రాసిన ఒక వ్యాసాన్ని షేర్ చేశారు. ''ఎన్నికలను ఎలా రిగ్గింగ్ చేయాలి? 2024లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని రిగ్గింగ్ చేయడానికి బ్లూప్రింట్ గా నిలిచాయి. అంచెలంచెలుగా ఇది ఎలా జరిగిందో నా వ్యాసం చూపిస్తుంది'' అని ఆ పోస్ట్ లో తెలిపారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ఎలా రిగ్గింగ్ చేసి గెలిచిందో రాహుల్ గాంధీ స్టెప్ బై స్టెప్ వివరించారు. అవి ఇలా ఉన్నాయి.

దశ 1: ముందుగా ఎన్నికల కమిషన్ ను నియమించడానికి ఏర్పాటైన ప్యానెల...