భారతదేశం, మే 30 -- మే 9, 10 తేదీల మధ్యరాత్రి బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించడం ద్వారా భారత్ పై దాడులు చేయాలన్న పాకిస్తాన్ ప్రణాళికను భారత్ భగ్నం చేసిందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఏకంగా ఒక బహిరంగ సభలోనే అంగీకరించారు. అజర్ బైజాన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ''మే 10 తెల్లవారుజామున, ఉదయం ప్రార్థనలకు ముందే పాక్ సాయుధ దళాలు భారత్ పై దాడి చేయాలని ప్లాన్ చేశాయి. కానీ అది జరగకముందే భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాకిస్తాన్ లోని పలు ప్రావిన్సులపై దాడి చేసింది'' అని అన్నారు.

భారత్ మే 7 నుంచి ప్రారంభించిన దాడులకు దీటుగా బదులివ్వాలన్న తమ ఆలోచన భారత్ బ్రహ్మోస్ క్షిపణి దాడులతో భగ్నం అయిందని షరీఫ్ వెల్లడించారు. '''మే 10 తెల్లవారుజామున, ఉదయం ప్రార్థనలకు ముందే భారత దురాక్రమణకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నాం. తెల్లవారు జామున 4.30...