భారతదేశం, జూలై 4 -- చైనా తన ఆయుధాలను పాక్ ద్వారా పరీక్షించుకుంటోందని, పాక్ చైనాకు ఒక లైవ్ ల్యాబ్ గా మారిందని భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ రాహుల్ ఆర్ సింగ్ శుక్రవారం అన్నారు, సరిహద్దు వెంబడి ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లకు వ్యతిరేకంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు ప్రధాన మద్దతుదారుగా చైనా నిలిచిందన్నారు.

పాకిస్తాన్ సైనిక సామగ్రిలో, ఆయుధాల్లో 81 శాతం చైనీయులవేనని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. భారత్, పాక్ ఘర్షణను చైనా తన ఆయుధాల పరీక్షా కేంద్రం మార్చుకుందన్నారు. "చైనా తన ఆయుధాలను అక్కడ ఉన్న వివిధ ఇతర ఆయుధ వ్యవస్థలకు వ్యతిరేకంగా పరీక్షించగలిగింది. పాకిస్తాన్ చైనాకు అందుబాటులో ఉన్న లైవ్ ల్యాబ్ లాంటిది'' అన్నారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన కార్యక్రమంలో లెఫ్టినెంట్ జనరల్ సింగ్ మాట్లాడారు.

"ఒక సరిహద్దు, ఇద...