భారతదేశం, మే 30 -- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం నుంచి తన వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి ఉత్పత్తులను విక్రయించడానికి కొన్ని తప్పుడు వెబ్ సైట్లు సద్గురు పేరును దుర్వినియోగం చేస్తున్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఏఐ సహకారంతో తన పేరును, ఫొటోను, ఇమేజ్ ను వాడుకుని, మార్కెట్లో ఉత్పత్తులను అమ్ముతున్నారని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. 'నాకు ఉన్న మంచి పేరును ఉపయోగించుకుని, నా అనుమతి లేకుండా, ఉత్పత్తులను అమ్ముతున్నారు-గర్భ యాత్ర (గర్భంపై) అనే పుస్తకాన్ని నా ఫొటోతో అమ్ముతున్నారు. నా ఫొటో లేదా వీడియోలను చూసి ప్రజలు గుడ్డిగా ఫాలో అవుతున్నారు. ఇది పూర్తిగా మోసం. వారంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నారు'' అని తన తరఫు న్యాయవాది...