భారతదేశం, జూన్ 20 -- భారత్, పాకిస్తాన్ ల మధ్య ఇటీవల జరిగిన కాల్పుల విరమణపై పాకిస్తాన్ ఎట్టకేలకు నోరు విప్పి వాస్తవాలను వెల్లడించింది. తమ రెండు కీలక వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేసిన తర్వాత తప్పనిసరై తామే కాల్పుల విరమణను కోరామని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్ లోని నూర్ ఖాన్, షోర్ కోట్ వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసిందని దార్ ఓ టీవీ న్యూస్ షోలో చెప్పారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.

టీవీ న్యూస్ షోలో దార్ మాట్లాడుతూ ''దురదృష్టవశాత్తూ భారత్ మే10 తెల్లవారుజామున 2.30 గంటలకు మరోసారి క్షిపణి దాడులు చేసింది. నూర్ ఖాన్ వైమానిక స్థావరం, షోర్కోట్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఆ దాడుల్లో ఆ రెండు ఎయిర్ బేస్ లు ధ్వంసమయ్యాయి. ఆ తరువాత, 45 నిమిషాల్లో సౌదీ యువరా...