భారతదేశం, మే 1 -- భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటకీ.. సామాజిక తెలంగాణ సాధించలేకపోయామంటూ ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే డే ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆమె.. సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులుండాలన్నారు. మే డే స్పూర్తితో తెలంగాణలో అసమానతలు తొలగిపోవటానికి కృషి చేయాలని చెప్పుకొచ్చారు. మే 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన కార్మికుల సమ్మెకు జాగృతి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన రైతుబంధు పథకంపై కవిత స్పందిస్తూ. ఎకరం ఉంటే పది వేలు.. పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చామన్నారు. కానీ భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయామని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో భూమి ఉన్నా.. లేకున్నా ఎలా ఆదుకోవాలే అనే దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

"బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు స్కీమ్ తీసుకువచ్చాం. ఎకరం భూమి ఉన...