Andhrapradesh, జూలై 3 -- కృష్ణా బేసిన్ లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటికే జూరాల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీ స్థాయిలో ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం 68,169 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవాళ్టి ఉదయం రిపోర్ట్ ప్రకారం.. శ్రీశైలం డ్యామ్‌లో పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 875.6 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.89 టీఎంసీలుగా ఉంది. ఔట్ ఫ్లో 63,150 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు తెలిపారు

శ్రీశైలం పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులుగా ఉంటుంది. ఫలితంగా శ్రీశైలం డ్యామ్‌ నిండడానికి తక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్లు ఎత్తి దిగువకు నీటిని వి...