భారతదేశం, ఫిబ్రవరి 8 -- గుజరాత్​లో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. "పరీక్షకు ఎందుకు ఆలస్యంగా వచ్చావు?" అని అడిగిన టీచర్​ని.. "నువ్వెవరు నన్ను అడగడానికి?" అంటూ ఓ 12వ తరగతి విద్యార్థి దారుణంగా చెంప మీద కొట్టాడు. సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ఈ ఘటన ఉపాధ్యాయుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించడమే కాకుండా, విద్యా సంస్థల్లో భద్రత, క్రమశిక్షణపై తీవ్ర ఆందోళనలను పెంచింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన గుజరాత్‌ పంచమహల్ జిల్లా శెహ్రా పట్టణంలోని ఎస్‌జే దవే హైస్కూల్‌లో జరిగింది. 18 ఏళ్ల విద్యార్థి మొహమ్మద్ ఖాన్ అన్సారీ, రెండొవ ప్రిలిమినరీ పరీక్షకు ఆలస్యంగా వెళ్లాడు. ఇన్విజిలేటర్‌గా ఉన్న మహిళా టీచర్ ఆలస్యానికి కారణం అడగ్గా.. అతడు "నన్ను ఇంట్లోనే ఎవరూ ఏమీ అడగరు, నన్ను ప్రశ్న...