Telangana, మే 4 -- తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి. లబ్ధిదారుల జాబితాను వెల్లడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఇదిలా ఉంటే దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా.... కొందరు హార్డ్ కాపీలను సమర్పించకలేకపోయారు. అయితే పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.

హార్డ్ కాపీలను సమర్పించలేకపోయిన దరఖాస్తుదారులు.... మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు లేదా వార్డు కార్యాలయాల్లో సమర్పించాలని సూచించింది. దరఖాస్తు ఫారమ్ తో పాటు ...