భారతదేశం, మే 11 -- అమర జవాన్ మురళీ నాయక్‌కు సైనిక లాంఛనాలతో, వేలాది మంది అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. జై జవాన్, భారత మాతాకీ జై నినాదాలతో వీర జవాన్‌‌కు జనం తుది వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్....ఇతర మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు నివాళులర్పించారు. వీర జవాన్‌ మురళీ నాయక్ పాడె మోసి మంత్రి నారా లోకేష్ కడసారి వీడ్కోలు పలికారు.

ఆపరేషన్ సిందూర్ లో భాగంగా కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ భౌతికకాయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండల కళ్లితండాలోని మురళీ నాయక్ నివాసానికి వెళ్లి మంత్రులు మంత్రులు నారా లోకేశ్, వంగలపూటి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, అనగాని సత్య ప్రసాద్, పలువురు ...