Andhrapradesh,delhi, మే 23 -- వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన. రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు కలిశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో పోలవరంపై చర్చించినట్లు చెప్పారు. పోలవరాన్ని 2027లోపు పూర్తి చేసేలా ప్రణాళిక ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మళ్లీ రూ.980 కోట్లు పెట్టి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నామని చెప్పారు.

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎం...