Hyderabad,telangana, మే 3 -- బ‌తుక‌మ్మ కుంట అభివృద్ధి ప‌నులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో వేగాన్ని పెంచాల‌ని కొద్ది రోజుల్లోనే ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి. బ‌తుక‌మ్మ‌ కుంట‌ను సంద‌ర్శించనున్నార‌ని వెల్లడించారు. అప్ప‌టి వ‌ర‌కూ చెరువుకు రూపాన్ని తీసుకురావాల‌న్నారు.

శుక్ర‌వారం బ‌తుక‌మ్మ‌కుంట అభివృద్ధి ప‌నుల‌ను పరిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్. పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ. 7 కోట్ల‌తో ఈ చెరువును అభివృద్ధి చేస్తుండగా.. వేగంగా పనులు పూర్తి కావాలని చెప్పారు. మోకాలు లోతు మ‌ట్టిని తీయ‌గానే చెరువు ఆన‌వాళ్లు క‌నిపించిన బ‌తుక‌మ్మ‌కుంట‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు.

వ‌చ్చే బ‌తుక‌మ్మ ఉత్స‌వాల నాటికి చెరువు పూర్త‌వ్వాల‌ని.. బ‌తుక‌మ్మ ఆట‌లు ఇక్క‌డే ఆడేలా సిద...