భారతదేశం, జూలై 16 -- కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణలోని రామతీర్థ కొండల్లోని అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల గుహలో ఓ రష్యన్ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు నెలల తరబడి నివసించారు. వారిని సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు గుర్తించారు.

అక్కడికి వచ్చే సాహస ప్రియుల కోసం పోలీసులు ఆ ప్రాంతాన్ని తనిఖీ చేస్తుండగా, ఒక గుహకు దారితీసే అడుగుల గుర్తులు కనిపించాయి. ఆ గుర్తులను ఫాలో అవుతూ వెళ్లగా, వారికి దట్టమైన అడవిలో చెట్ల మధ్య ఒక గుహ కనిపించింది. ఆ గుహ ప్రవేశద్వారం వద్ద దుస్తులు ఆరేసి ఉన్నాయి. ప్రవేశ ద్వారం ఒక ప్లాస్టిక్ షీట్ తో మూసేసి ఉంది. గుహలో దేవుళ్ల ఫొటోలు ఉన్నాయి. వాటికి పూజలు చేసినట్లుగా గుర్తు లు ఉన్నాయి. ఆ గుహలో ఓ చిన్నారి ఆడుకుంటుండగా, 40 ఏళ్ల మహిళ తన మరో కుమార్తెతో కలిసి నిద్రిస్తోంది. ఆమెను పోలీసులు ప్రశ్నించగా.. తన పేరు నీనా ...