భారతదేశం, ఏప్రిల్ 26 -- జమ్ముకశ్మీర్​ పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన బాధితుల కథలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పహల్గామ్​ ఉగ్రదాడి సమయంలో అక్కడే ఉన్న ఓ బీజేపీ నేత తాజాగా తనకు ఎదురైన సంఘటనను సోషల్​ మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఓ కశ్మీరి గైడ్​ సాహసం చేసి.. తన కూతురిని కాపాడినట్టు వివరించారు.

జమ్ముకశ్మీర్​ పహల్గామ్​ అనే ప్రాంతంపై మంగళవారం ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. అక్కడే ఉన్న టూరిస్ట్​లను భయభ్రాంతులకు గురి చేసి మారణహోమం సృష్టించారు. ఈ ఘటనలో 26మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

అయితే, పహల్గామ్​ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఛత్తీస్​గఢ్​కి చెందిన బీజేపీ యువ మోర్చా నేత అరవింద్​ అగర్వాల్​ అక్కడే ఉన్నారు! రాయ్​పూర్​కి చెందిన ఆయన.. తన భార్య, పిల్లలతో పాటు మొత్తం 11 మందితో కలిసి హాలీడే కోసం జమ్ముకశ్మీర్​ వెళ్లారు.

మంగళవారం జర...