భారతదేశం, ఏప్రిల్ 25 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్​ ఉగ్రదాడిలో ప్రమేయం ఉందని భావిస్తున్న లష్కరే తోయిబా టెర్రరిస్ట్​ ఆసిఫ్​ షేక్​ ఇల్లు గురువారం రాత్రి ధ్వంసమైంది. అంతేకాదు, ఆసిఫ్​ షేక్​తో పాటు మరొక ఉగ్రవాది ఇల్లు కూడా పేలుడులో ధ్వంసమైనట్టు తెలుస్తోంది.

ఈ సమాచారాన్ని హెచ్​టీ తెలుగు, హెచ్​టీ స్వతంత్రంగా ధృవీకరించలేదు.

ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆదిల్ హుస్సేన్ థోకర్, ఆసిఫ్ షేక్ ఇళ్లలో భద్రతా దళాలు తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే వాటిల్లో అమర్చిన పేలుడు పదార్థాలు పేలినట్టు సమాచారం. ఫలితంగా ఆయా పేలుళ్లలో ఇళ్లు ధ్వంసమయ్యాయని నివేదిక తెలిపింది.

దక్షిణ కశ్మీర్​లోని అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెహరా బ్లాక్​కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్ మంగళవారం జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. పుల్వామా జిల్లా త్రాల్​కు చె...