భారతదేశం, మే 27 -- తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ అన్నారు. కడపలో నిర్వహిస్తున్న మహానాడు సందర్భంగా మంత్రి నారా లోకేశ్ 'నా తెలుగు కుటుంబం' పేరుతో 6 శాసనాలు ప్రతిపాదించారు.

1. తెలుగుజాతి విశ్వఖ్యాతి

2. యువగళం

3. స్త్రీశక్తి

4. పేదల సేవల్లో సోషల్‌ రీఇంజినీరింగ్‌

5. అన్నదాతకు అండగా

6. కార్యకర్తలే అధినేత

పేద ప్రజలకు కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ టీడీపీ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. కడపలో నిర్వహించిన మహానాడులో లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ ప్రతిపక్షం కొత్తకాదు, అధికారం కొత్త కాదు అన్నారు.

భవిష్యత్తు కోసం 6 శాసనాలను ప్రతిపాదిస్తున్నామన్నారు. ఈ శాసనాలన్నీ తప్పకుండా అమలుచేస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలుగువారు ప్రపంచంలోనే ముందుండాలనేది టీడీపీ ఆకాంక్ష అన్నారు. పార్టీలో పనిచ...