Hyderabad,telangana, ఏప్రిల్ 25 -- కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణకు వచ్చిన పాకిస్తాన్ దేశ పౌరులు. ఏప్రిల్ 27లోపు వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ సూచించారు.

మెడికల్ వీసాపై వచ్చిన వారికి ఏప్రిల్ 29 వరకు గడువు ఉంటుందని డీజీపీ తెలిపారు. ఏప్రిల్ 30 వరకు అటారి వాఘ బార్డర్ తెరిచి ఉంటుందని. ఈలోపు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఇక్కడే ఉంటే. న్యాయపరమైన చర్యలు ఉంటాయన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....