Hyderabad, మే 10 -- తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందన్నారు.

బెంగుళూరు వేదికగా "ది హిందూ" పత్రిక నిర్వహించిన సదసులో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పెట్టుబడుల కోసం ప్రపంచ దేశాలు చైనా ప్లస్ వన్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న తరుణంలో దానిని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని వాటిని సమగ్రంగా తెలియజేశారు.

తాము డీలిమిటేషన్‌కు వ్యతి...