భారతదేశం, జూన్ 10 -- అమెరికాలో పర్యటిస్తున్న భారతీయులకు భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వీసాల దుర్వినియోగం లేదా దేశంలోకి అక్రమ ప్రవేశాన్ని వాషింగ్టన్ సహించదని భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం తన తాజా సందేశంలో పేర్కొంది. నెవార్క్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థినిని బంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా ఈ ప్రకటన చేసింది.

చట్టబద్ధమైన ప్రయాణికులను తమ దేశానికి ఆహ్వానిస్తామని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం తన సందేశంలో పేర్కొంది. అయితే, అక్రమంగా అమెరికాను సందర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవేశించడం, వీసాల దుర్వినియోగం, అమెరికా చట్టాల ఉల్లంఘనను సహించబోమని భారత్ లోని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

నెవార్క్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని నేలపై బోర్లా పడుకోబెట్టి చేతులు వెనక్...