భారతదేశం, మే 12 -- భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. కాల్పుల విరమణపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఊహాగానాలపై ఆపరేషన్ సింధూర్ గురించి సమాచారం ఇచ్చేందుకు సైన్యం సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది.

ఇదే కాన్ఫరెన్స్‌లో ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతిని పాకిస్థాన్‌లోని కిర్నా హిల్స్‌లో ఉన్న అణు కర్మాగారాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందా అని ప్రశ్నించారు. దీనిపై ఎయిర్ మార్షల్ స్పందిస్తూ.. 'లేదు, మా వైపు నుంచి అలాంటిదేమీ జరగలేదు' అని బదులిచ్చారు.

దీనిపై ఎయిర్ మార్షల్ భారతి మాట్లాడుతూ.. 'కిర్నా హిల్స్‌లో కొన్ని అణు స్థావరాలు ఉన్నాయని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఆ విషయం మాకు తెలియదు... మేము కిర్నా హిల్స్‌పై దాడి చేయలేదు, పాక్‌కు చెందిన 9 ఉగ్రవాద స్థావరాలను మాత్రమే భారత సైన్యం లక్ష...