Telangana, మే 28 -- కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. శానిటేషన్ వర్కర్స్ ను తొలగించి ఆ పనులను పిల్లలతో రెగ్యులర్ గా చేయించడం నేరమన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కవిత ఓ ప్రకటన ద్వారా ప్రకటించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వీపింగ్ మరియు శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ . 40,000 కేటాయించింది. నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు. వీరు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ఈ పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించింది. పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు ...