Telangana,hyderabad, మే 1 -- ఎల్ఆర్ఎస్ (ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ) దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీతో గడువు ముగిసిన నేపథ్యంలో.. మరోసారి గడువు పొడిగించింది. మే 3వ తేదీ వరకు దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించి. 25 శాతం రాయితీని పొందవచ్చని ప్రకటించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు.

మే 3వ తేదీలోపు ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ అవకాశం ఉంటుంది. ఈ గడువు ముగిసిన తర్వాత అలాంటి అవకాశం ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించగా.. మరోసారి పెంచే అవకాశం లేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. పురపాలక శాఖ జారీ చేసిన జీవో 28 ప్రకారం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు, ఓపెన్‌ స్పేస్‌ ఛార్జీలు చెల్లిస్తే 25 శాతం రాయితీ పొందవచ్...