Telangana,hyderabad, మే 23 -- ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది. ఈ స్కీమ్ కోసం రాష్ట్రవ్యాప్తంగానూ భారీగా దరఖాస్తులు రావటంతో.. అర్హులైన వారిని మాత్రమే గుర్తించి ఎంపిక చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ గా మొదటి విడత కింద 71 వేల మందికి ఇండ్లను మంజూరు చేసింది. వీరిలో పలువురు ఇళ్ల నిర్మాణాలను కూడా చేపట్టారు. మరోవైపు రెండో విడత కింద పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకు ప్రోసిడింగ్స్ కాపీలను అందజేసేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను పట్టాలెక్కించే క్రమంలో ప్రభుత్వం యాప్ సర్వే నిర్వహించింది. దరఖాస్తుదారుల అన్ని వివరాలను ఆన్ లైన్ చేసింది. వీటి ఆధారంగా దరఖాస్తులను 3 కేటగిరిలుగా విభజించింది. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచగా. ఇక సొంత స్థలం లేనివారని ఎల్‌-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కో...