Hyderabad,telangana, మే 23 -- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద మీడియాతో మాట్లాడిన ఆమె. కేసీఆర్ కు రాసిన లేఖపై స్పందించారు. రెండు వారాల క్రితం లేఖ రాసింది నిజమేనని స్పష్టం చేశారు. కానీ అంతర్గత లేఖ బయటికి రావటం వెనక కుట్ర ఉందని ఆరోపించారు. కేసీఆర్ గారు దేవుడన్న కవిత.ఆయన చుట్టు దయ్యాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

"రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా తెలిపాను. కార్యకర్తల అభిప్రాయాలే చెప్పాను. నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పలేదు. నా వ్యక్తిగత అజెండా లేదు. ఆ లేఖ ఎలా బహిర్గతమైంది..? లేఖ లీక్‌ చేసింది పార్టీలోని కొందరు కోవర్టులే" అంటూ కవిత ఆరోపించారు.

"కేసీఆర్‌ దేవుడు.. కానీ కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. అతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి?.. నా...