భారతదేశం, మే 8 -- కరాచీ, లాహోర్ వంటి పాకిస్తాన్ ప్రధాన నగరాల్లో డ్రోన్ దాడులు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్తాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ కెఎస్ఇ -30 గురువారం 7.2 శాతం వరకు పడిపోయింది. దాంతో కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో గురువారం ఒక గంట పాటు ట్రేడింగ్ నిలిచిపోయింది.

ఏప్రిల్ 22 న పహల్గామ్ దాడి జరిగిన నాటి నుంచి, పాకిస్తాన్ కెఎస్ఇ -30 ఇండెక్స్ దాని విలువలో 12.75 శాతం కోల్పోయింది. పాక్ స్టాక్ మార్కెట్ లో వరుసగా నాలుగో సెషన్లోనూ నష్టాలు చవిచూశాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత్ జరిపిన దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ బెంచ్ మార్క్ షేర్ ఇండెక్స్ బుధవారం దాదాపు 6 శాతం నష్టంతో ప్రారంభమై, చివరకు 3.1 శాతం నష్టంతో సెషన్ ను ముగించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....