భారతదేశం, మే 8 -- ఆపరేషన్ సిందూర్' గురించి చాలా చర్చ జరుగుతోంది. భారతదేశం నిర్వహించిన ఒక పెద్ద సైనిక ఆపరేషన్ ఇది. దీనిలో భాగంగా ఉగ్రవాద స్థావరాలపై దాడి జరిగింది. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇతరులు ఈ పేరును ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం ఈ ప్రతీకార చర్య తీసుకుంది. కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిలో దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.

ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, మరికొందరు తమ కోసం అంటే ట్రేడ్‌మార్క్‌గా ఆపరేషన్ సిందూర్ అనే పేరును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తును ...