Amaravati,andhrapradesh, మే 1 -- అమరావతి పున: ప్రారంభ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోదీ రానున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రికి కూటమి ప్రభుత్వం ఘన స్వాగతం పలకనుంది.
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణమంతా ఎస్పీజీ ఆధీనంలో ఉండనుంది. ఇప్పటికే ఆయా బలగాలు మోహరించాయి. ఇక మోదీ పాల్గొనే సభపైకి కూడా అతి తక్కువ మందికే అవకాశం ఉండనుంది. మొత్తంగా 14 మందికి మాత్రమే చోటు కల్పించనున్నారు. ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, కూటమి నేతలకు అవకాశం ఉండనుంది.
అమరావతి రాజధాని పున: ప్రారంభ పనులకు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో విజయవాడలో శుక్రవారం ఉదయం 5 గ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.