Amaravati,andhrapradesh, మే 2 -- నవ్యాంధ్ర రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. మధ్యాహ్నం తర్వాత గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ. అక్కడ్నుంచి సభా వద్దకు చేరుకున్నారు. ప్రధానికి రాష్ట్ర గవర్నర్ తో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పలువురు మంత్రులు స్వాగతం పలికారు.

అమరావతి పునఃప్రారంభ పనుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. మొదట తొలుగులో తన స్పీచ్ ను ప్రారంభించిన దుర్గా భవానీ అమ్మవారిని గుర్తు చేశారు. "అమరావతి అనేది ఒక నగరం మాత్రమే కాదు. సుమారు రూ. 60 వేల కోట్ల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేశాం. ఇవి కాంక్రీట్ నిర్మాణాలు మాత్రమే కాదు. భవిష్యత్ వికాసిత్ భారత్ కు బాటలు వేస్తాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అభినందనలు తెలియజేస్తున్నాను" అని ప్రధ...