భారతదేశం, మే 22 -- భారతదేశంలో ద్విచక్ర వాహన సెగ్మెంట్ రేసు మరింత ఆసక్తికరంగా మారుతోంది. హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) కీలక ప్రకటన చేసింది. గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంట్‌లో కంపెనీ కొత్త ఉత్పత్తి యూనిట్ ప్రారంభించబోతోంది. ఇందుకోసం హోండా సుమారు రూ.920 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ చర్యతో హోండా భారతదేశంలో తన వ్యాపారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

విఠలాపూర్(గుజరాత్)లో కొత్త ప్రొడక్షన్ లైన్ 2027 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది సంవత్సరానికి 6.5 లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతో మొత్తం ప్లాంట్ సామర్థ్యం సంవత్సరానికి 2.61 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని అంచనా. దీంతో కొత్తగా 1,800 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రస్తుతం మనేసర్, ...