భారతదేశం, మే 21 -- పుష్ప 2 మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు అల్లు అర్జున్‌. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 18 వంద‌ల కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన టాప్ త్రీ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది.

పుష్ప 2 త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీతో ఓ మూవీ చేయ‌బోతున్నాడు అల్లు అర్జున్‌. ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రూపొందుతోన్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవ‌ల అల్లు అర్జున్ పుట్టిన‌రోజు పుర‌స్క‌రించుకొని ఈ మూవీని అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. అమెరికాలోనే ఫేమ‌స్‌ వీఎఫ్ఎక్స్ కంపెనీ ప్ర‌తినిధుల‌తో హీరో అల్లు అర్జున్‌, డైరెక్ట‌ర్ అట్లీ ముచ్చ‌టిస్తోన్న ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోతోనే మూవీపై అంచ‌నాలు అమాంతం పెరిగిపోయాయి....