భారతదేశం, జనవరి 8 -- హైదరాబాద్ నగరవాసులకు జలమండలి మరోసారి అలర్ట్ ఇచ్చింది. మహా నగరానికి నీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-2 లో మరమ్మత్తు పనులు చేయనున్నట్లు తెలిపింది. కోదండాపూర్ నుంచి గొడకండ్ల వరకు ఉన్న పంపింగ్ మెయిన్‌పై 200 మిమీ డయా ఎంఎస్ పై ఏర్పడిన లీకేజీని సరిచేయనున్నారు.

అంతేకాకుండా 2375 మిమీ డయా ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్‌లను మార్పిడి చేస్తారు. నాసర్లపల్లి వద్ద జంక్షన్ పనులు చేపట్టడం. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న బటర్‌ఫ్లై వాల్వ్‌లు, ఎన్‌ఆర్‌వీ (NRV)లను మార్పిడి చేయడం వంటి పనులు చేపట్టాల్సి ఉందని జలమండలి ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ఈ పనుల కారణంగా. జనవరి 10వ తేదీన ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే జనవరి 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు (36 గంటలు) నీటి సరఫరాకు అంతరాయం ఉంటుంది.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్...