భారతదేశం, మే 19 -- పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తున్న కేసులో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను హర్యానా హిసార్ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ హైకమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు పరిచయం ఉందని, ఆయన జ్యోతి పాకిస్తాన్ పర్యటనకు సహాయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ట్రావెల్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి, పాకిస్థాన్ కు భారతదేశ సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

అయితే జ్యోతి మల్హోత్రా భారతదేశంలోని చాలా పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ తాను తీసిన వీడియోలను యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఇలా ఆమె రెండేళ్ల క్రితం సికింద్రాబాద్‌లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభం సందర్భంగా...సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో చక్కర్లు కొట్టింది. కేంద్ర మంత్రులకు అతి సమీపంలో వీడియోలు తీస్తూ... వందే భారత్ లో వీడియోలు తీసింది.

బీజేపీ ఎంపీలు, అప్పటి గ...