Telangana,hyderabad, జూలై 10 -- హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో కల్తీకల్లు తాగిన 19 మంది అస్వస్థత గురి కావటం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో పలువురి పరిస్థితి విషమించటంతో ప్రాణాలు కోల్పోయారు. మరికొందిరికి నిమ్స్ లో చికిత్స అందుతోంది. అసలు ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారు.? ఏం జరిగింది..? అనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు కల్తీ కల్లు కేసులో ఎక్సైజ్‌ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితమే కల్లు శాంపిళ్లను అధికారులు పరీక్షలకు పంపారు. నిర్వాహకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....