భారతదేశం, ఫిబ్రవరి 20 -- జీఎస్టీ మోసానికి పాల్పడిన గేమింగ్ సంస్థ యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. తెలంగాణలో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్‌పై భారీ స్థాయిలో చేపట్టిన దాడుల్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ హైదరాబాద్ జోనల్ యూనిట్ రూ. 13,000 కోట్ల విలువైన సిండికేట్‌ గుట్టురట్టు చేసింది.

డిజిటల్ కేవైసీ వెరిఫికేషన్ సేవలలో ప్రత్యేకత కలిగిన యాడ్సన్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ పంకజ్ కుమార్‌ను అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలు చెల్లింపు అగ్రిగేటర్లు, థర్డ్ పార్టీ టెక్నాలజీ ప్రొవైడర్లు సహా అనుబంధ ఫిన్‌టెక్ కంపెనీల సహాయంతో అక్రమ ఆన్‌లైన్ గేమింగ్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. షెల్ కంపెనీలకు నకిలీ కేవైసీ వెరిఫికేషన్లు ఇచ...