భారతదేశం, ఏప్రిల్ 25 -- కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు.. హైదరాబాద్ పోలీసులు ప్రస్తుతం అయ్యారు. నగరంలో ఉంటున్న పాకిస్తాన్ జాతీయుల వివరాలపై ఆరా తీస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు నివసిస్తున్నారు. వీరిలో.. 156 మంది దీర్ఘకాలిక వీసాలపై ఉన్నారు. 13 మంది స్వల్పకాలిక వీసాలపై ఉన్నారు. మిగిలిన 39 మంది వైద్య, వ్యాపార వీసాలపై నగరానికి వచ్చినట్టు తెలుస్తోంది.

అయితే.. తాజా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారిని వెనక్కి వెళ్లాలని ఆదేశించింది. వైద్యం కోసం వచ్చిన వారికి ఏప్రిల్ 29 వరకు అవకాశం ఇచ్చింది. మిగతా వారికి ఈనెల 27వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చింది. దీంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. భాగ్యనగరానికి వచ్చిన పాకిస్తానీలు ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు, ఎవరితో ఉన్నారు, ఇక్కడివారిని వివాహం చేసుకున్నవారు ఎవరు.. వ...