భారతదేశం, జూలై 22 -- హైదరాబాద్‌, జూలై 22: నగరవాసులారా అలర్ట్.. హైదరాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, సైబరాబాద్‌ పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని సూచించారు.

నగరంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ అంతరాయాలు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....