భారతదేశం, సెప్టెంబర్ 12 -- ఆసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ రంగ ప్రదర్శన అయిన '17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 2025' హైదరాబాద్‌లో జరగనుంది. ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఈఎంఏ) ఆధ్వర్యంలో ఈ ఎక్స్‌పో నవంబర్ 25 నుంచి 28, 2025 వరకు హెచ్‌ఐటీఈఎక్స్ ఎగ్జిబిషన్ సెంటర్​లో నిర్వహించనున్నారు.

ఈ మెగా ఈవెంట్ నవంబర్ 25న 'నాలెడ్జ్ డే'తో ప్రారంభమవుతుంది. నోవోటెల్ హోటల్‌లో జరిగే ఈ సెమినార్‌కి 1500 మందికి పైగా ప్రతినిధులు, ఏడుగురు అంతర్జాతీయ నిపుణులు హాజరవుతారు. ఈ సెమినార్‌లో పౌల్ట్రీ రైతులకు ఉపయోగపడే అనేక అంశాలపై చర్చించనున్నారు. వాటిలో ముఖ్యమైనవి: సుస్థిరమైన ఫీడ్, పౌల్ట్రీ కార్యకలాపాల్లో ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధుల నివారణ, వ్యర్థాల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగావకాశాలు వంటివి ఉంటాయి.

'ఒక దేశం, ఒక ఎక్స్‌పో' అనే నినాదంతో ఐపీఈఎంఏ ఈ కా...