Hyderabad,telangana, ఏప్రిల్ 25 -- భవన నిర్మాణలు, లేఔట్ల అనుమతుల మంజూరు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చింది. వేగంగా, సులభంగా అనుమతులు పొందేలా 'బిల్డ్ నౌ' అప్లికేషన్ సేవలను ప్రవేశపెట్టింది. మొదట్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఈ సేవలు అందబాటులో ఉండగా. తాజాగా హెచ్ఎండీఏ పరిధిలోనూ ఈ సేవలు ప్రారంభమయ్యాయి.

టీజీ - బీపాస్‌ ద్వారా భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు వచ్చేవి. అయితే ఇందులో ఇబ్బందులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టడంతో పాటు అత్యంత వేగంగా అనుమతులు ఇచ్చేలా తెలంగాణ ప్రభుత్వం 'బిల్డ్ నౌ' వ్యవస్థను తీసుకువచ్చింది. తొలుత ఈ విధానాన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలో అమలు చేయగా.. సత్ఫలితాలు వచ్చాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ అప్లికేషన్ ప్రత్యేకతలు, వివరాలెంటో ఇక్కడ తెలుసుకో...