భారతదేశం, మే 26 -- హెచ్‌ఏఎల్ అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్, లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ) ఉత్పత్తిని కర్ణాటక నుంచి ఏపీకి తరలించాలని సీఎం చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది ఆందోళనకరం అని అభివర్ణించారు. భారతదేశ అంతరిక్ష, రక్షణ రంగానికి రాష్ట్రం చేసిన సహకారాన్ని హైలైట్ చేస్తూ కర్ణాటకకు రక్షణ పారిశ్రామిక కారిడార్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలవాలనున్నట్లు మంత్రి పాటిల్ తెలిపారు.

"నేను దీని గురించి ప్రిన్సిపల్ సెక్రటరీతో, ముఖ్యమంత్రితో చర్చిస్తాను. నేను మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రితో కూడా మాట్లాడుతాను. ఒకవేళ చంద్రబాబు నాయుడు అలాంటి ప్రకటన చేసి ఉంటే, అది తప్పు అవుతుంది.

ఆయన తన...