Hyderabad, అక్టోబర్ 14 -- స్టార్ హీరో చియాన్ విక్రమ్‌కు తెలుగు నాట ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. చియాన్ విక్రమ్ నట వారసుడుగా ఆయన కుమారుడు ధృవ్ హీరోగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ధృవ్ హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ వయోలెంట్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం బైసన్.

అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్‌పై బైసన్ సినిమాను రూపొందించారు. ఈ మూవీకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. బైసన్ సినిమాలో ధృవ్‌కు జోడీగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చేసింది. మరో హీరోయిన్ రజీషా విజయన్ కీలక పాత్ర పోషించింది.

అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల్లో బైసన్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా (అక్టోబర్ 13) సోమవారం రాత్రి 9 గంటల సమయంలో బైసన్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. రా అండ్ రస్టిక్‌ సీన్లతో బైసన్ సినిమాను కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌ల...