Hyderabad, ఆగస్టు 11 -- హీరోయిన్ రక్షిత సోదరుడు రాన్నా హీరోగా పరిచయం కాబోతోన్నారు. రాన్నా హీరోగా తెరకెక్కిన సినిమా ఏలుమలై. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఆచార్ చేయగా.. సీనియర్ హీరో జగపతి బాబు ప్రధాన పాత్ర పోషించారు. తరుణ్ కిషోర్ సుధీర్ నిర్మాణంలో పునీత్ రంగస్వామి ఏలుమలై సినిమాకు దర్శకత్వం వహించారు.

నరసింహా నాయక్ (రాజు గౌడ) సమర్పణలో తరుణ్ సుధీర్ క్రియేటివ్స్, డీఈ ఆర్ట్ స్టూడియోస్ బ్యానర్లపై యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి రచన, మాటలు, దర్శకత్వం పునీత్ రంగస్వామి వహించారు.

ఇప్పటి వరకు 'ఏలుమలై' నుంచి వచ్చిన టైటిల్ టీజర్, పోస్టర్, పాటలు ఇలా అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఏలుమలై చిత్రం నుంచి గుండెల్ని మెలిపెట్టి, మనసుల్ని కదిలించే పాట కాపాడు దేవా సాంగ్‌ను విడుదల చేశారు.

సింగర్ మంగ్లీ ఆలపించిన 'కాపాడు...