Hyderabad, మే 31 -- టాలీవుడ్‌లో సింగర్‌గా మంచి పేరు తెచ్చుకుంది అదితి భావరాజు. ఎక్కువగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో జై బాలయ్య సాంగ్‌తో అదితి భావరాజు ఎక్కువ పాపులర్ అయింది. గాయనిగా సక్సెస్ అయిన అదితి భావరాజు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న సినిమా దండోరా.

లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ను స్థాపించి తొలి చిత్రం 'క‌ల‌ర్‌ ఫోటో'తో అందరి దృష్టిని ఆక‌ర్షించిన డైన‌మిక్ ప్రొడ్యూస‌ర్ ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని అనంతరం 'బెదురులంక 2012' వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు దండోరా సినిమాను ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని నిర్మిస్తున్నారు.

దండోరా చిత్రానికి ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో రూపొందుతోన్న'దండోరా'లో బ‌ల‌మైన ప్రేమ క‌థాంశంతో పాటు క‌ఠిన‌మైన నిజాలను, స‌మాజంలో కొన‌సాగుతోన్న సామాజిక దుష్ప‌ప్ర‌వ‌ర్...